Monday 1 September 2014



అల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ ఏం ఎస్ పెన్షన్అర్స్ అసోసియేషన్
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

సర్కులర్                                                                                                                                                          Dt.01.09.2014
ప్రియమైన మిత్రులారా
10.07.2014 న తెనాలి లో మన రాష్ట్ర సదస్సు మరుయు 19.27.2014 న అఖిల భారత మహా సభలు
తమిళనాడు లోని వెల్లూరు పట్టణం లో దిగ్విజయంగా జరిగాయి.

30.7.2014 న 7వ వేతన సంఘానికి మన అసోసియేషన్ తరపున వివేదిక సమర్పించడం జరిగింది. ఈ సారి విడి విడిగా కాక అన్ని సంఘాలు కలిపి ఒకే నివేదిక సమర్పించడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం.
కొత్త ప్రభుత్వం ఏర్పడినతర్వాత మన సంఘాల తరపున తాత్కాలిక భ్రుతి, కరువు భత్యం మూల వేతనం లో వీలినం , అమలు చైయల్సిన తేది తదితర అంశాలపై ఆర్ధిక మంత్రి గారికి , ప్రధాన మంత్రి గారికి అన్ని సంఘాలు నివేదిక సమర్పించడం జరిగింది. కాని ఇప్పటివరకు దానిపై ఏ రకమైన స్పందన ప్రభుత్వం వైపు  నుంచి లేదు . ఈ నేపద్యం లో అన్నిసంఘాలు ఐక్యంగా కార్యాచరణకు సమాయత్త మౌతున్నై. వీరు తెసుకునే అన్ని కార్యక్రమాలకు మన అసోసియేషన్ పూర్తి మద్దతు తెలియజేసింది.
ఐతే ఈ సమస్యలు సాధించుకోవాలంటే మన అసోసియేషన్ బలపరచుకోవలసిన అవసరం ఉంది ఈ నేపద్యంలో 27.8.2014 న మంగళగిరి హెడ్ పోస్ట్ ఆఫీసు లో  రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది  ఈ సమావేశానికి కా.వి.మోహనరావు మాజీ p - 3 రాష్ట్ర    అధ్యక్షులు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో తీసుకున్న  నిర్ణయాలు :
1. డివిజన్/ జిల్లా కమిటీల ఏర్పాటు - ఈ విషయం పైపూర్తిగా చర్చించి రాష్ట్ర కన్వీనర్ మరియు ఏ.జి.ఎస్  sk .హుమాయున్  అన్ని డివిజన్ లలో  సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలు నియమించాలని నిర్ణయించడం జరిగింది.
సమావేశం తేదిలు
 6.9.2014 విశాఖపట్నం, 7.9.2014 ఉదయం - విజయనగరం ,7.9.2014 సాయంత్రం అనకాపల్లి,  8.9.2014  శ్రీకాకుళం, 9.9.2014 కాకినాడ, 10.9.2014 రాజమండ్రి , 11.9.2014 గుడివాడ , 13.9.2014 మచిలీపట్టణం , 14.9.2014 విజయవాడ.
ఈ సమావేశాలకు  కా .వై .నాగభూషణం , sk .హుమాయున్ లు హజరౌతారు. తిరిగి 25,30 తేది ల మధ్య కడప ,కర్నూలు ,అనంతపురం జిల్లా లలో సమావేశాలు జరుగుతాయి.
2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహా సభలు అక్టోబర్ 15 లోపు ఏర్పాటు చైయాలని , సెప్టెంబర్  15 న స్టీరింగ్ కమిటీ జరిపి venue , తేదిలు నిర్ణయించడం జరుగుతుంది.
కావున ఆ యా  జిల్లాల లోని N F P E అనుభంద సంఘాల డివిజన్ కార్యదర్శులు భాద్యత తీసుకొని పైన తెలిపిన తేదిలలో సమావేశాలు జరుపుటకు కృషి చైయల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
         ఇట్లు
అభినందనలతో


వై.నాగభూషణం
(రాష్ట్ర కన్వీనర్ ) 

No comments:

Post a Comment